పరమాన్నం-పాయసాన్నం- బెల్లం పరమాన్నం-సూర్యనారాయణ ప్రసాదం-ఆదివారం ప్రసాదం
Payasam_ Bellam paramannam |
నవరాత్రులలో తొమ్మిదో రోజు నవమి తిథి నాడు పాయసాన్నం అమ్మవారికి నైవేద్యం గ పెడతాము. ఈ పాయసాన్నం ఆది వరం రోజు సూర్యదేవునికి నైవేద్యం గ పెడతారు.
కావలసిన పదార్ధాలు
కావలసిన పదార్ధాలు
బియ్యం 1 కప్
బెల్లం 1 కప్
నెయ్యి 1/4 కప్
నీళ్లు 1కప్
పాలు 1 కప్
జీడిపప్పు , కిస్మిస్ , పచ్చ కర్పూరం , యాలకుల పొడి
తయారుచేసే విధానం :
1. బియ్యం కడిగి నానబెట్టాలి. ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి వేసి, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి.
2.అదే గిన్నెలో పాలు నీళ్లు వేసి బాగా మరగబెట్టాలి. పాలు పొంగు వచ్చాక , బియ్యం వేసి ఉడకనివ్వాలి.
3. బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసి కరిగే వరకు కలిపి, నెయ్యి వేసి ఇంకొక 5 నిముషాలు ఉడికించి, దానిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ , పచ్చ కర్పూరం ఒక చిటికెడు వేసి, కొద్దీ గ నెయ్యి వేసి దించేయాలి.
ప్రసాదం పరమాన్నం/పాయసాన్నం రెడీ
you tube link Thank you
Comments
Post a Comment